ఫిబ్రవరిలో అంబేద్కర్‌ విగ్రహ నిర్మాణం పూర్తి

.. మంత్రి ప్రశాంత్‌ రెడ్డి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:   రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్‌ అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను ఫిబ్రవరిలో పూర్తిచేస్తామని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు పనులు త్వరితగతిన జరుగుతున్నాయని చెప్పారు. హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌ వద్ద 125 అడుగుల పొడవైన అంబేద్కర్ విగ్రహాన్ని ప్రభుత్వం నిర్మిస్తున్నది. ఆ పనులను మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌కు అంబేద్కర్ అంటే ఎంతో గౌరవమనిఆయన రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. ఆ మహానుభావుడి ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి జనరంజక పాలన కొనసాగిస్తున్నారని చెప్పారు.నగరం నడిబొడ్డున 11.5 ఎకరాల్లో నిర్మితమవుతున్న ఈ కట్టడాల గురించి సీఎం కేసీఆర్ మానిటరింగ్ చేస్తున్నారని తెలిపారు. విగ్రహం అడుగు భాగంలో పార్లమెంట్ తరహా నిర్మాణం చేస్తున్నామని వెల్లడించారు. అంబేద్కర్ విగ్రహం కింది భాగంలో అంబేద్కర్ ఫొటో గ్యాలరీతోపాటు ఆయన గొప్పతనంజీవిత చరిత్రను ఏర్పాటు చేస్తామన్నారు. సినిమా థియేటర్ కూడా ఉంటుందన్నారు.అంబేద్కర్ విగ్రహం పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు తమకు సలహాలు సూచనలు ఇస్తున్నారని తెలిపారు. ఫిబ్రవరి మాసంలో పనులు పూర్తి చేస్తామన్నారు. ఏప్రిల్‌లో అంబేద్కర్ జన్మదిన వేడుకలు సందర్భంగా విగ్రహాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.