అవినీతిపరులు రాజ్యమేలుతుంటే నీతిపరులు జైలు పాలవుతున్నారు

మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: ఫెడరల్ క్యాస్ట్రో చెప్పినట్టుగా అవినీతిపరులు రాజమేలుతుంటే నీతిపరులు జైలు పాలు అవుతారనే విధంగా జగన్మోహన్ రెడ్డి వైనం ఉందన్నారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. నిన్న వైసీపీ వారి విస్తృత స్థాయి సమావేశంలో జగన్మోహన్ రెడ్డి జోక్స్ వేశారని గంటా ఎద్దేవా చేశారు. ఆ జోక్స్ విని మహిళలు నవ్వుకుంటున్నారన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టు అయిన సంగతి జగన్మోహన్ రెడ్డికి తెలియదని చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానే అధికారులు అరెస్టు చేశారని చెప్పడం హాస్యాస్పదమని గంటా అన్నారు

మంగళవారం టీడీపీ అధినేత చంద్రబాబు త్వరలో విడుదల కావాలంటూ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఫిఫ్త్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద గల శ్రీ యోగ సిద్ధి ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. పదేళ్ల క్రితం ఆర్థిక నేరాలతో అరెస్టయి బెయిల్ పై ఉన్న వ్యక్తి జగన్ అని అన్నారు. నీతిపరుడు… 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం గల మహనీయుడు.. 14 ఏళ్లు పరిపాలన చేసిన చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారని గంటా అన్నారు.

Leave A Reply

Your email address will not be published.