సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయతి కార్యదర్శులడిమాండ్లను పరిష్కరించాలి
- బిసి సంక్షేమ సంఘన జాతీయ అద్యక్షులు ఆర్.కృష్ణయ్య డిమాండ్
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: గత 11 రోజులుగా సమ్మె చేస్తున్న 9355 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులను మరియు ఔట్ సోర్సింగ్ పంచాయతి కార్యదర్శులను చర్చలకు పిలిపించి డిమాండ్లను పరిష్కరించి, సమ్మె విరమింపజేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కు బిసి సంక్షేమ సంఘన జాతీయ అద్యక్షులు ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. సోమవారం హైదరాబాద్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సంఘం ప్రదాన కార్యదర్శి ఏ. శ్రీకాంత్,ఉపాధ్యక్షులు సురేష్ లతో కలిసి మీడియా సమావేశం లో మాట్లాడారు. పంచాయతీ కార్యదర్శులు డిమాండ్ న్యాయమైనవి. వీరిని ఉద్యోగంలోకి తీసుకున్నప్పుడు మూడు సంవత్సరాలలో రెగ్యులరైజ్ చేస్తామని నోటిఫికేషన్లో స్పష్టంగా పేర్కొన్నారు కానీ తర్వాత G.O-26 ద్వారా మరో సంవత్సరం పొడిగించడం జరిగింది. కానీ జీవో 26 ప్రకారం నాలుగు సంవత్సరాల గడిచిన కూడా రెగ్యులర్ చేయకపోవడంతో అనివార్య పరిస్థితులలో సమ్మెకు వెళ్లడం జరిగింది. వీరిని న్యాయమైన డిమాండ్లకు ప్రజా సంఘాలు, బీసీ/ఎస్సీ/ఎస్టీ సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు, అధికార పార్టీలు శాసనసభ్యులు పూర్తి మద్దతు ప్రకటించారు. కానీ ఇంతవరకు ప్రభుత్వం తగురీతిలో స్పందించకపోవడం న్యాయం కాదు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యమాల ద్వారానే గొప్ప జాతీయ నాయకుడిగా గుర్తింపు పొందడం జరిగింది. ఉద్యమాలు చేసి తెలంగాణను తెచ్చారు, ఉద్యమాలను గౌరవించి వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ప్రతిష్టకు పోకుండా తమ బిడ్డ లాంటి చిరు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరారు.
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల డిమాండ్స్ :
- మూడేళ్లకు రెగ్యులర్ చేస్తామని చెప్పిన ప్రభుత్వం మూడేళ్ల తర్వాత రెగ్యులర్ చేయకుండాG.O 26 ను తీసుకొచ్చి ఇంకో ఏడాది ప్రొఫెషన్ పీరియడ్ ను పెంచుతూ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. అయినా కూడా మేము పెంచిన మరియొక సంవత్సరంతో పాటు మొత్తం నాలుగేళ్లు ఉద్యోగ భద్రత లేకుండా పనిచేయడం జరిగింది.
- రెగ్యులర్ చేయాలంటూ రెండేళ్లు అధికారులు చుట్టూ,మంత్రుల చుట్టూ తిరుగుతున్న ఎవరూ పట్టించుకోలేదు. 11 ఏప్రిల్ 2023 తో నాలుగేళ్ల సర్వీస్ ని కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. అయినా కూడా ప్రభుత్వం వైపు నుండి రెగ్యులర్ చేస్తున్నాం అని ఎటువంటి ప్రకటన రాకపోవడం వల్ల తీవ్ర మానసిక క్షోభకు గురై తీవ్రమైన అభద్రతా భావంతో తేదీ: 13 ఏప్రిల్ 2023న ప్రభుత్వానికి సమ్మె నోటీసు అందించి, తేదీ: 28 ఏప్రిల్, 2023 నుండి నివధిక సమ్మెను చేపట్టడం జరిగింది.
- మూడేళ్ల ప్రొబేషన్ పీరియడ్ నిబంధనతో 15వేల జీతంతో జూనియర్ పంచాయతీ కార్యదర్శులను నియమించుకొని,మూడేళ్ల తర్వాత గ్రేడ్-4 ఉద్యోగులుగా గుర్తించి రెగ్యులర్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ లోనే పేర్కొన్నది.
చాలా మందికి కానిస్టేబుల్, కోర్టు, సింగరేణి లాంటి ఉద్యోగాలు వచ్చిన అన్నిటిని వదులుకుని బంగారు తెలంగాణ పునర్జీర్మానం లో భాగస్వామ్యం అవుతామని ఆశ తో మూడేళ్లకు రెగ్యులర్ అవుతాం అని నమ్మకంతో ఎంతో మంది యువతీ యువకులు నెగెటివ్ మార్కింగ్ విధానం లో పరీక్షలు రాసి రాజ్యాంగ బద్దంగా ఈ ఉద్యోగం లో చేరిన్నారు.
మూడేళ్ళ పాటు రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఎన్నో ఒత్తిడుల ఎదుర్కుంటూ సుమారు 50 రకాల విధులను నిర్వర్తిస్తూ ఎన్నో జాతీయ అవార్డులు తీసుకు రావడం ఒక్క 2023 లోనే దేశంలో మరే రాష్ట్రానికి సాధ్యం కానీ 13 జాతీయ అవార్డులు తీసుకు రావడం జరిగింది రాత్రింబవళ్ళు పని చేసి జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఈ విజయం సాధించారు పల్లె ప్రగతి పనులను విజయవంతంగా నిర్వర్తించి గ్రామాల్లో ఎన్నో ఆస్తులను సృష్టించి ప్రజలందరి మన్ననలు పొందడం జరిగింది.
ఒత్తిడి తట్టుకోలేక కొంత మంది విది నిర్వహణ లో ప్రమాదలకు గురై సుమారు 56 మంది మరణిస్తే ఆ కుటుంబాలకు ఉద్యోగ భద్రత ఆర్థిక భద్రత లేకుండా పోయింది.
ఒత్తిల్లు తట్టుకోలేక వివిధ ప్రమాదాల్లో మరణించిన వారి స్థానం లో అలాగే రాజీనామాలు చేసిన వారి స్థానం లో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో సుమారు వెయ్యి మందిని అవుట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులుగా నియమించుకుని వారికి 10,500 వేతనం ఇస్తున్నారు.
- 1) వెంటనే జూనియర్ పంచాయతీ కార్యదర్శులు రెగ్యులర్ చేస్తూ గ్రేడ్- 4 ఉద్యోగులుగా గుర్తించి నాలుగు సంవత్సరాల సర్వీస్ ను కలుపుతూ ప్రభుత్వ ఉత్తర్వులను విడుదల చేయాలి. 2)అవుట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా వెంటనే ప్రమోట్ చేసి వీరిని కూడా రెగ్యులర్ చేయాలి. 3) మరణించిన పంచాయతీ కార్యదర్శుల కుటుంబాలకు 20 లక్షల నష్ట పరిహారం చెల్లిస్తూ కారుణ్య నియామక ప్రక్రియ చేపట్టి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి.
ఈ కార్యక్రమంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సంఘం గౌరవ అద్యక్షులు సందీప్,కోశాధికారి,శశిధర్,మహిళా కాన్వినర్స్ స్వప్న, కవిత తదితరులు పాల్గొన్నా