కస్తూర్బా పాఠశాలలో తొలగించిన టీచర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్; కస్తూర్బా పాఠశాలలో పనిచేసే 937 టీచర్లను తొలగించడం అన్యాయమని వీరిని వెంటనే డ్యూటీలోకి తీసుకోవాలని డిమాండ్ తో వందలాది మంది టీచర్లతో నేడు విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడించారు. ఈ ముట్టడికి వివిధ జిల్లాల నుండి పెద్ద యెత్తున టీచర్స్ కదలివచ్చారు. ఈ ఉద్యమానికి నిరుద్యోగా జాక్ ఛైర్మన్ నీల వెంకటేష్ నాయకత్వం వహించారు.టిచర్లను నుద్దేశించి  రాజ్య సభ సభ్యులు ఆర్.కృష్ణయ్య ప్రసంగిస్తూ రెండు సంవత్సరాల క్రితం అక్టోబర్ మాసంలో ఫైనాన్స్ డిపార్ట్ మెంటు జి.ఓ.ఆర్.నెం. 1321 తేది: 19.10.2021 న ఇస్తూ కస్తుర్బా గాంధీ పాఠశాలల్లో 937 టిచర్ పోస్టులను  మెరిట్ ఆధారంగా భర్తీ చేశారు. ప్రభుత్వ  G.Oలో కాంట్రాక్టు టీచరు గా భర్తీ చేయాలని స్పష్టంగా యుంది.  కానీ విద్యాశాఖ అధికారులు మౌకికంగా చెప్పి తీసుకుంటున్నారు. ప్రతి సంవత్సరం మార్చిలో టర్మినేట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న  937 మంది టీచర్లను మెరిట్ పై  సెలక్టు చేసి, నియామకం చేసి కెజిబివిలలో బోధకులుగా పని చేస్తున్నారు. వీరికి రాత పూర్వీక ఆదేశాలు ఇవ్వడం లేదు. మౌకికంగా చెప్పి చేర్చుకుంటున్నారు. మరల మార్చిలో తొలగిస్తున్నారు.  వీరిని ఏటా మార్చిలో టర్మినేట్ చేస్తున్నారు.  మరల ఆగస్టులో తీసుకుంటున్నారు. ఇటీవల ప్రభుత్వం వారు కస్తూర్బా పాఠశాలలో టీచర్స్ గా పని చేసేందుకు 1241 కాంట్రాక్ట్ టీచర్ల రిక్రూమెంట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇక్కడ ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినది యెమనగా 2021లో కస్తూర్బా పాఠశాలలో పని చేసేందుకు 937 కాంట్రాక్ట్ టీచర్లను నియమించారు. వీరు గత రెండు సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. వీరిని ఎలా తొలగిస్తారు. వీరు కూడా కాంట్రాక్ట్ టీచర్స్ గా రిక్రూట్ చేశారు. రెండు సంవత్సరాల బోధన అనుభవం యుంది. వీరిని తీసివేసి కొత్తవారిని రిక్రూట్మెంట్ చేయవలసిన అవసరం ఏముంది. వీరికి అన్యాయం చేయడం తగునా! వీరికి విద్యార్హతలు యున్నవి. కాంట్రాక్టుగా రిక్రూట్ అయ్యారు. పైగా రెండు సంవత్సరాలుగా బోధన అనుభవం ఉంది. కొత్తగా వచ్చే వారు ఇంత కంటే మంచిగా యుంటారా?  అయితే పని చేస్తున్న తాత్కాలిక పోస్టుల్లో మళ్లీ తాత్కాలిక ఉద్యోగులను నియమించవద్దని సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నాయి. తీర్పు కాపి జత పరుస్తున్నాము. కానీ ప్రతి సంవత్సరం విద్యాశాఖ అధికారులు కొత్త వారిని నియమిస్తామని బెదరిస్తున్నారు. కావున 2021 నవంబర్ నుండి పని చేస్తున్న 937 టిచర్లను యదాతధంగా కొనసాగించాలని  విజ్ఞప్తి చేస్తున్నాము. వీరిని కాంట్రాక్టు టీచర్సుగా మారుస్తూ వారినే యదాతధంగా కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నాము.వీరిని ప్రతి ఏటా తొలగించి కొత్తగా నియమిస్తే సుప్రీంకోర్టు తీర్పును దిక్కరించడమే అవుతుంది. కావున తమరు జోక్యం చేసుకొని 937 మంది టిచర్లను కాంట్రాక్టు టీచర్సుగా మార్చి ఆదేశాలతో కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నాము.ఈ ఉద్యమంలో నీల వెంకటేష్, అంజి, సతీష్, వెంకటేష్, నాగ బ్రహ్మ చారి, రవి, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.