రాజకీయ లబ్ది కోసమే బీజేపీ, కాంగ్రెస్ నాయకుల డ్రామాలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/బీర్కూర్ ప్రతినిధి:  బీర్కూర్ పోచారం కాలనీలో ఇండ్ల నిర్మాణంలో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు రాజకీయ లబ్ది కోసమే డ్రామాలు ఆడుతున్నారని బీర్కూర్ తెరాస నాయకులు ఆరోపించారు. గురువారం రోజు బాధితులతో కలసి పోచారం కాలనీలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ బీర్కూర్ పోచారం కాలనీ నుండి బై పాస్ రోడ్డు నిర్మాణంలో లక్షల రూపాయల విలువ గల ఇండ్లు కోల్పోతున్న బాధితులకు ఇండ్లు నిర్మించి ఇవ్వడం తప్పా అంటూ ప్రశ్నించారు, ఇండ్లు కోల్పోతున్న బాధితులకు అండగా ఉండాల్సింది పోయి, ఇండ్ల నిర్మాణం ఆపివేయాలని కోరడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు.కాంగ్రెస్, బీజేపీ నాయకులకు ప్రజల పట్ల వారికి ఎంత ప్రేమ ఉందొ తెలిసిపోయిందని, రాజకీయ లబ్ధికే బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఆడుతున్న డ్రామాలు ప్రజలకు అర్ధమవుతున్నాయని పేర్కొన్నారు. బాధితులకు నిర్మిస్తున్న ఇండ్ల విషయంలో అడ్డు వస్తే ఊరుకునేదిలేదని హెచ్చరించారు. ఇండ్లు కోల్పోయిన బాధితులతో పాటు ఎంపీపీ రఘు, రైతు సమన్వయ అధ్యక్షుడు అవారి గంగారాం, ఎంపీటీసీ సందీప్, కో ఆప్షన్ ఆరీఫ్, గ్రామ పార్టీ కార్యదర్శి కోరిమె రఘు, మన్నన్ తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.