పుట్టపాక ప్రజల చైతన్యం బీజేపీ నాయకులను పరుగులు పెట్టించింది

.. టిపిసిసి అద్యక్షుడు రేవంత్ రెడ్డి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: పుట్టపాక ప్రజల చైతన్యం బీజేపీ నాయకులను పరుగులు పెట్టించిందని టిపిసిసి రేవంత్ రెడ్డి అన్నారు. డ్రామారావుకు ఎనిమిదేళ్లుగా మునుగోడు గుర్తుకు రాలేదా? బతుకమ్మ చీరలు నేత పని కూడా.. మునుగోడు నేతన్నలకు ఇవ్వలేకపోయాడని ఎద్దేవా చేశారు. జీఎస్టీ పేరుతో నేతన్నలను బీజేపీ నిండా ముంచింది. టీఆరెస్ ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదు అన్నారు. ధరణి పేరుతో దగా చేసి గిరిజనుల భూములను గుంజుకుంటున్నారు. టీఆరెస్, బీజేపీ నేతలను నమ్మొద్దని ప్రజలు ఫ్లెక్సీలు పెట్టి చెబుతున్నారు. కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదు అని హేచ్చరించారు. మీకు కష్టమొస్తే.. అర్ధరాత్రి అయినా మీ కోసం వస్తా 2023 లో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఆడబిడ్డ గెలుపు బాధ్యత మీ అందరిదీ మునుగోడులో నిండు మనసుతో ఈ ఆడబిడ్డకు ఓటు వేసి ఆశీర్వదించండి. మునుగోడులో కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణ రాజకీయ ముఖ చిత్రమే మారిపోతుందని, చరిత్రలో కమ్యూనిస్టులు అమ్ముడుపోలేదు. అలాంటి కమ్యూనిస్టులను లేకుండా చేయాలని కేసీఆర్ కుట్ర చేశాడు కమ్యూనిస్టులు ఆత్మ ప్రభోదానుసారం ఓటు వేయండి అని సూచించారు.

Leave A Reply

Your email address will not be published.