తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కార్మిక, కర్షక, శ్రమ జీవులకు ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికుల దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. కార్మిక, కర్షక సంక్షేమాభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. చెమట చుక్కలను ధారపోసి పరోక్షంగా సమాజాభివృద్ధికి కృషి చేస్తున్న అందరికీ శుభాకాంక్షలు. తరతరాలుగా కష్టజీవి శ్రమతోనే ప్రపంచంలో సంపద దృష్టి జరుగుతోంది. మహోన్నతమైన విశ్వమానవ సౌధానికి శ్రమజీవుల త్యాగాలే పునాదిరాళ్లు అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.కార్మిక, కర్షక, శ్రమ జీవులకు ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికుల దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. కార్మిక, కర్షక సంక్షేమాభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. చెమట చుక్కలను ధారపోసి పరోక్షంగా సమాజాభివృద్ధికి కృషి చేస్తున్న అందరికీ శుభాకాంక్షలు. తరతరాలుగా కష్టజీవి శ్రమతోనే ప్రపంచంలో సంపద దృష్టి జరుగుతోంది. మహోన్నతమైన విశ్వమానవ సౌధానికి శ్రమజీవుల త్యాగాలే పునాదిరాళ్లు అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.కార్మికులు ప్రమాదం కారణంగా మరణిస్తే రూ. 6 లక్షలు ఆ కుటుంబానికి చెల్లిస్తున్నామని సీఎం తెలిపారు. 2014 నుంచి నేటి వరకు 4001 మంది బాధిత కుటుంబాలకు రూ. 223 కోట్లు చెల్లించాం. ప్రమాదం కారణంగా వైకల్యానికి గురైన రూ. 5 లక్షల చొప్పున 504 మంది కార్మికులకు రూ. 89 కోట్లు చెల్లించాం. కార్మిక కుటుంబంలోని ఇద్దరు ఆడపిల్లల పెండ్లికి రూ. 30 వేల చొప్పున వివాహ బహుమతి ఇస్తున్నాం అని కేసీఆర్ గుర్తు చేశారు. 2014 నుంచి నేటి వరకు 46,638 మంది లబ్ధిదారులకు రూ. 130 కోట్లు చెల్లించాం అని సీఎం తెలిపారు.మహిళా కార్మికులకు 2 కాన్పుల వరకు రూ. 30 వేల చొప్పున ప్రసూతి ప్రయోజనాలు అందిస్తున్నాం. 2014 నుంచి నేటి వరకు 1,01,983 మంది లబ్ధిదారులకు రూ. 280 కోట్లు చెల్లించాం. కార్మికులపై ఆధారపడిన 1,49,536 మంది లబ్ధిదారులకు రూ. 94 కోట్లు చెల్లించాం. మరణానంతరం అంతిమయాత్ర కార్యక్రమాలకు 39,797 మందికి రూ. 98 కోట్లు చెల్లించాం అని సీఎం కేసీఆర్ తెలిపారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.