రజక, నాయి బ్రాహ్మణల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది..ఆందోలన వద్దు

  సెలూన్‌ లాండ్రీ, ధోబీఘాట్‌లకి విద్యుత్ అధికారులు కనెక్షన్ కట్ చేయరు            బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్:  రజకనాయి బ్రాహ్మణల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.సెలూన్‌ లాండ్రీధోబీఘాట్‌లకి విద్యుత్ అధికారులు కనెక్షన్ కట్ చేయరు. ఎవరు అధైర్యపడవద్దని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి లాండ్రీలుధోబీ ఘాట్‌లుహెయిర్ కటింగ్ సెలూన్‌లకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్నిఅమలు చేస్తుందని తెలిపారు. ఆర్థిక శాఖ బడ్జెట్‌ను విడుదల చేయాలని ఈ మేరకు మంత్రి కోరారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను క్రమానుగతంగా తప్పకుండా అమలు చేస్తుందని హామినిచ్చారు. ఆరు గ్యారంటీల అమలుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.