దేశ వ్యాప్తంగా కేంద్రం గిరిజనులకు కేటాయించిన బడ్జెట్ కన్నా …తెలంగాణ ప్రభుత్వం ఎక్కువ నిధులు కేటాయించింది.

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: దేశ వ్యాప్తంగా కేంద్రం గిరిజనులకు కేటాయించిన బడ్జెట్ కన్నా …తెలంగాణ ప్రభుత్వం ఎక్కువ నిధులు కేటాయించిందని మంత్రి సత్యవతి రాథోడ్, విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, హరిప్రియ నాయక్ అన్నారు. పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి  మాట్లాడారు. బీజేపీకి ప్రేమంతా ఎన్నికలు, అధికారంపైనే పేద ప్రజలపై లేదు. రేవంత్ రెడ్డి గొంతుపెంచి మాట్లాడితే అబద్ధం నిజం కాదు. రేవంత్ రెడ్డికి సోయిఉంటే, చేతనైతే కేంద్రంపై పోరాటం చేయాలి అన్నారు. మేడారం జాతరకు బిఅరెస్ నాలుగేళ్ళ పాటు ఇచ్చిన నిదులు కాంగ్రెస్ జీవితకాలంలో ఇవ్వలేదన్నారు. బిఅరెస్ ను పాతాళం లోకి తొక్కడం కాదు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పాతాళం లోకి పోకుండా చూసుకో అని సవాల్ విసిరారు. సమయం వచ్చినప్పుడు గిరిజన బంధు ఇస్తాం, సీఎం కేసీఆర్ కు గిరిజనులంటే ఇష్టం పోడు భూముల లు త్వరలోనే పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. కేంద్రం గిరిజనుల పట్ల అక్కసు కక్కడం మానుకోవడం లేదు. పార్లమెంట్ సాక్షిగా మళ్ళీ అబద్ధాలు ప్రకటించారు. గిరిజన యూనివర్సిటీ ప్రతిపాదన అందలేదని పార్లమెంట్ లో కేంద్రమంత్రి ప్రకటన ఆశ్చర్యాన్ని కలిగించింది. గిరిజన యూనివర్సిటీ అనేది విభజన చట్టంలోనే ఉంది. గిరిజన యూనివర్సిటీ కోసం నోడల్ ఏజెన్సీగా సెంట్రల్ యూనివర్సిటీని నియమించింది. 2017లోనే ములుగు జిల్లా దగ్గర 170 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.  HRD ద్వారా కేంద్రానికి భూమిని ఉందని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. 2012, 22లో పార్లమెంట్ సెషన్స్ లో రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగినప్పుడు కేంద్రం దగ్గరే ప్రతిపాదనలు ఉన్నాయని కేంద్రం ప్రకటించింది. తెలంగాణకు యూనివర్సిటీ రాకుండా బీజేపీ కక్షకట్టింది. నిన్న ధర్మేంద్ర ప్రధాన్ చేసిన ప్రకటన వెనక్కి తీసుకోవాలి. పార్లమెంట్ సాక్షిగా కేంద్రమంత్రి అసత్య ప్రకటన చేసినందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. పార్లమెంట్ ను తప్పుదారి పట్టేలా సీనియర్ కేంద్రమంత్రి తప్పుడు ప్రకటన చేయడం ఏంటి అని ప్రశ్నించారు. కేంద్ర బీజేపీకి కేసీఆర్ పై కోపమా? తెలంగాణ ప్రజలపై కోపమా? బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి జాతీయస్థాయిలో ఏమైనా పోటీ వస్తదని అబద్ధపు ప్రకటన చేశారా? కేంద్రప్రభుత్వం గిరిజనుల పట్ల నిర్లక్ష్యం వహిస్తోంది. గిరిజన యూనివర్సిటీ పై స్పష్టమైన ప్రకటన ఇవ్వాలి అన్నారు. ఎమ్మెల్యే ల కొనుగోలు ప్రయత్నం కేసు ను సీబీఐ కి అప్పగించినా మాకు భయం లేదు. హైకోర్టు తీర్పు పై లీగల్ ఒపీనియన్ తీసుకుంటాం అని వారు పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.