మాజీ సైనికుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి

  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మాజీ సైనికుల సంక్షేమ సంఘం విజ్ఞప్తి

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: సైనికుల కుటుంబాలను ఆదుకోవాలని  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మాజీ సైనికుల సంక్షేమ సంఘం విజ్ఞప్తి చేసింది. ఆదివారం అల్వాల్లోని వేంకటేశ్వర పార్కులో సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రంగయ్యగౌడ్ అద్యక్షతన  సైనికుల కుటుంబాల సమావేశం జరిగింది.ఈ సందర్బంగా రంగయ్యగౌడ్ మాట్లాడుతూ రెండు న్నర దశాబ్దాలుగా మాజీ సైనికుల కుటుంబాల సంక్షేమానికి ప్రభుత్వాలు హామీ ఇస్తున్నాయి తప్ప పని మాత్రం ఎక్కడ వేసియా గొంగడి అక్కడ వేసిన మాదిరిగా ఉందని ఆవేదన వ్యక్తం చేసారు. జవ హర్నగర్ కార్పొరేషన్ పరిధిలో తమకు కేటా యించిన ఇళ్ల స్థలాలను ఆయా ప్రభుత్వాలు స్వాధీనం చేయలేకపోయాయని వాపోయారు.గతంలో మల్కాజిగిరి ఎంపీగా సైనికుల కుటుంబాలపై అవగాహన ఉన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వెంటనే తమ సమస్యలు పరిష్క రించాలని కోరారు.ఈ సమావేశం లో మాజీ సైనికులు,వీరమరణం పొందిన వారి  బార్యలు, కుటుంబ సబ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.