లోకేష్ పాదయాత్రపై ప్రభుత్వం తీరు సరైంది కాదు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (పాదయాత్ర పై ప్రభుత్వం తీరు సరైంది కాదని టీడీపీ సీనియర్ నేత దూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ నిబంధనలతో పోలీసులు పాదయాత్రకు అనుమతి ఇవ్వడం హస్యాస్పదమన్నారు. పాదయాత్రలకు అనుమతి అవసరం లేదని జగన్ రెడ్డి తల్లి విజయలక్ష్మి చెప్పారని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేశారు. లోకేష్ పాదయాత్రపై ప్రభుత్వం తీరు సరైంది కాదన్నారు. గతంలో జగన్ ఒళ్లు బలిసి పాదయాత్ర చేసారా..? అని ప్రశ్నించారు. కులాల వారిగా మంత్రులతో తిట్టించే పని చేస్తున్నారని, కేవలం తిట్టడం కోసమే మంత్రులు పని చేస్తున్నారని, వారి శాఖలలో ఏం జరిగుతుందో కూడా మంత్రులకు తెలియదని అన్నారు.ఏపీ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, లోకేష్ పాదయాత్రతో వైసీపీ అరాచకానికి స్వస్తి పలుకుతామని దూళిపాళ్ల నరేంద్ర అన్నారు. లోకేష్ యావగళం పాదయాత్ర నవశకానికి నాంది అని అన్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైందని, ఏపీ పోలీసులపై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. లోకేష్ పాదయాత్రపై వైసీపీ కుట్రలను ఎదుర్కొంటామన్నారు. టీడీపీ 40 లక్షల పసుపు సైనికులు లోకేష్కు అండగా ఉంటారని దూళిపాళ్ల నరేంద్ర స్పష్టం చేశారు