అసెంబ్లీ నుంచి ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ వాకౌట్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: త‌మిళ‌నాడు అసెంబ్లీ నుంచి ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ ఆర్ ర‌వి వాకౌట్ చేశారు. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం చేస్తున్న స‌మ‌యంలో డీఎంకే స‌భ్య‌లు సోమవారం స‌భ‌లో గంద‌ర‌గోళం సృష్టించారు. నినాదాలు చేస్తూ ప్ర‌సంగాన్ని అడ్డుకున్నారు. ఈ నేప‌థ్యంలో సీఎం స్టాలిన్ జోక్యం చేసుకున్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం రాసి ఇచ్చిన ప్ర‌సంగాన్ని మాత్రమే రికార్డులోకి తీసుకోవాల‌ని, గ‌వ‌ర్న‌ర్ త‌న ప్ర‌సంగంలో కొత్త‌గా జోడించిన అంశాల‌ను తీసివేయాల‌ని సీఎం స్టాలిన్ స్పీక‌ర్‌ను ఆదేశించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం రాసి ఇచ్చిన ప్ర‌సంగాన్ని మాత్ర‌మే గ‌వ‌ర్న‌ర్ ఒరిజిన‌ల్ స్పీచ్‌గా రికార్డు చేయాల‌ని అసెంబ్లీలో తీర్మానం చేశారు. దీంతో మ‌ళ్లీ స్టాలిన్‌, గ‌వ‌ర్న‌ర్ మ‌ధ్య వైరం కొత్త స్థాయికి చేరిన‌ట్లు అయ్యింది.

Leave A Reply

Your email address will not be published.