భార్యను కత్తితో పొడిచి ఉరేసుకున్న భర్త
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: సంగారెడ్డి జిల్లాలోని పోతిరెడ్డిపల్లి వీకర్ సెక్షన్స్ కాలనీలో దారుణం జరిగింది. ఓ భర్త దారుణానికి పాల్పడ్డాడు. తన భార్యను మొదటగా కత్తితో పొడిచి చంపాడు. అనంతరం తాను ఇంట్లోనే ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతులను యాదగిరి, యశోదగా గుర్తించారు. ఈ ఘటనకు కుటుంబ కలహాలే కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.