ప్రేమికుల మధ్య చిచ్చుపెట్టిన ద కేరళ స్టోరీ సినిమా

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: విడుదలకు ముందు నుంచే రాజకీయంగా తీవ్ర వివాదం రేపిన ది కేరళ స్టోరీ’  చిత్రం.. తాజాగా ఓ ప్రేమ జంట మధ్య చిచ్చు పెట్టింది. ఈ వివాదాస్పద చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ ప్రేమజంట ఈ చిత్రాన్ని చూసింది. అనంతరం ఇద్దరి మధ్య గొడవ చోటు చేసుకుంది. ఈ క్రమంలో ప్రియుడిపై యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మధ్యప్రదేశ్‌ రాష్ట్రం ఇండోర్‌ లో ఈ ఘటన చోటు చేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇండోర్‌ ఖజ్రానా పోలీసు స్టేషన్‌ ప్రాంతంలో ఓ ప్రేమ జంట నాలుగేళ్లుగా కలిసి ఉంటోంది. ఉన్నత చదువులు చదివిన యువతి ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తుండగా.. యువకుడు మాత్రం 12వ తరగతి వరకే చదివాడు. ప్రస్తుతం ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. కాగాఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన వివాదాస్పద చిత్రం ది కేరళ స్టోరీని చూసొచ్చారు. ఇంటికొచ్చాక సినిమా విషయంలో ఇద్దరి మధ్య గొడవ చోటు చేసుకుంది. ఇది కాస్తా తారాస్థాయికి చేరుకోవడంతో.. యువతి పోలీసులను ఆశ్రయించింది.తనను ప్రేమ పేరుతో మోసం చేశాడనితనపై అత్యాచారం చేశాడంటూ బాయ్‌ఫ్రెండ్‌పై కేసు పెట్టింది. ప్రస్తుతం అతనితో కలిసి జీవిస్తున్నట్లు తెలిపింది. పెళ్లి కోసం తనని మతం మార్చుకోవాలంటూ మానసికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. యువతి ఫిర్యాదు మేరకు సదరు యువకుడిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి అరెస్ట్‌ చేసినట్లు పోలీసు అధికారి దినేష్‌ వర్మ వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.