ముఖ్యమంత్రి ప్రకటించిన లక్ష రూపాయల రుణం అన్నీ బీసీల కులాలకు ఇవ్వాలి
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ముఖ్యమంత్రి ప్రకటించిన ఒక లక్షా రూపాయల రుణం ప్రతి కులానికి, ప్రతి కుటుంబానికి మంజూరు చేయాలని 16 బీసీ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ రోజు బి.సి భవన్ లో జరిగిన సమావేశానికి జాతీయ బి.సి సంక్షేమ సంఘ అధ్యక్షులు , రాజ్య సభ సభ్యులు ఆర్. కృష్ణయ్య అధ్యక్షత వహించారు.ముఖ్యమంత్రి ప్రకటించిన ఒక లక్ష రూపాయల రుణం నాలుగు కులాలకే కాకుండా బీసీ జాబితాలో యున్న 129 కులాలకు మంజూరు చేయాలని, అలాగే గత ఎన్నికలకు ముందు 2017లో రుణాలు ఇస్తామని 5 లక్షల 77 వేల మంది వద్ద దరఖాస్తులు తీసుకున్నారు. వీరికి వెంటనే లక్ష రూపాయలు మంజూరు చేయాలని డిమాండ్ చేసారు. 9 సంవత్సరాలు పాలనలో ఒక బీసీ రుణం ఎందుకు ఇవ్వలేదు. కనీసం ఇప్పుడు ఇవ్వడం హర్షించదగ్గ పరిణామమన్నారు.ఐతే జిల్లా బీసీ కార్పొరేషన్ ఈడీ – పోస్టులు ఎందుకు రద్దు చేశారు. ఇప్పుడు రుణాలు ఎవరి ద్వారా ఇస్తారని ప్రశ్నించారు. అందుకే ఈడి పోస్టులు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేసారు. బీసీ కార్పొరేషన్లకు MD – పోస్టులు గత 9 సంవత్సరాలుగా భర్తీ చేయలేదు. వెంటనే భర్తీ చేయాలని, బిసి కమిషనర్ పోస్ట్ గత 5 సంవత్సరాలుగా భర్తీ చేయలేదు. వెంటనే భర్తీ చేయాలని,. MBC – కార్పొరేషన్ MD పోస్టు భర్తీ చేయడం లేదు. దీన్ని కూడా వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేసారు.. BC/MBC కార్పొరేషన్