హరిప్రసాద్ పంపిన లోగో నా మనస్సుని హత్తుకుంది

.. భారత ప్రధాని నరేంద్ర మోడీ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓ నేత సోదరుడు ఎల్లి హరిప్రసాద్ పంపిన బహుమతి తన మనస్సుని హత్తుకుందని భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు.

‘‘మన్ కీ బాత్ ’’ కార్యక్రమంలో ప్రధానమంత్రి  నరేంద్రమోదీ తన ప్రసంగంలో ఓ ఆసక్తికరమైన విషయాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా ప్రధాని తన మాటల్లో వివరిస్తూ.. మిత్రులారా! నేటి కార్యక్రమాన్ని ఒక ప్రత్యేకమైన బహుమతి గురించిన చర్చతో ప్రారంభించాలనుకుంటున్నాను. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక నేత సోదరుడు ఉన్నారు. ఆయన పేరు యెల్ది హరిప్రసాద్ గారు. ఆయన తన స్వహస్తాలతో నేసిన ఈ జి-20 లోగోను నాకు పంపారు. ఈ అద్భుతమైన బహుమతిని చూసి నేను ఆశ్చర్యపోయాను.

హరిప్రసాద్ గారు తన కళతో అందరి దృష్టిని ఆకర్షించే స్థాయిలో నైపుణ్యం ఉంది.చేతితో నేసిన G-20 లోగోతో పాటు హరిప్రసాద్ గారు నాకు ఒక లేఖ కూడా పంపారు. వచ్చే ఏడాది జి-20 సదస్సుకు భారత్‌ ఆతిథ్యమివ్వడం గర్వించదగ్గ విషయమని ఇందులో రాశారు. దేశం సాధించిన ఈ విజయం నుండి పొందిన ఆనందంతో ఆయన తన స్వహస్తాలతో జి-20 లోగోను సిద్ధం చేశారు. తన తండ్రి నుండి ఈ అద్భుతమైన నేత ప్రతిభను వారసత్వంగా పొందిన ఆయన ఈ రోజు పూర్తి ఇష్టంతో అందులో నిమగ్నమై ఉన్నారు.

మిత్రులారా…! కొన్ని రోజుల క్రితం నేను జి-20 లోగోను, ప్రెసిడెన్సీ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్‌ను ఆవిష్కరించే అవకాశాన్ని పొందాను. ఈ లోగోను పోటీ ద్వారా ఎంపిక చేశారు. హరిప్రసాద్ పంపిన ఈ బహుమతి అందుకోగానే నా మనసులో మరో ఆలోచన వచ్చింది.

తెలంగాణలోని ఒక జిల్లాలో కూర్చున్న వ్యక్తి కూడా జి-20 వంటి శిఖరాగ్ర సదస్సుతో ఎంతగా అనుసంధానమయ్యాడో చూసి నేను చాలా సంతోషించాను. ఇంత పెద్ద సమ్మిట్‌ని దేశం నిర్వహించడం వల్ల హృదయం ఉప్పొంగిపోయిందని హరిప్రసాద్‌ గారి లాంటి చాలా మంది నాకు లేఖలు పంపారు.

పూణే నుండి సుబ్బారావు చిల్లారా, కోల్‌కతా నుండి తుషార్ జగ్‌మోహన్‌ పంపిన సందేశాలను కూడా నేను ప్రస్తావిస్తానని ప్రకటించారు. జి-20 మొదలుకుని భారతదేశం చేపట్టిన అనేక క్రియాశీలక ప్రయత్నాలను వారు ఎంతో ప్రశంసించారు.

Leave A Reply

Your email address will not be published.