అదుపుతప్పి కొండను ఢీకొన్న లారీ
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగువ మెట్ట గ్రామానికి 7 కిలోమీటర్ల దూరంలో పాత రైల్వే బ్రిడ్జ్ వద్ద జాతీయ రహదారిపై నంద్యాల నుండి గిద్దలూరు వైపు వస్తున్న లారీ అదుపు తప్పి కొండకు ఢీకొన్న ఘటనలో డ్రైవర్ కు గాయాలు, కాళ్ళు క్యాబిన్ లో ఇరుక్కున్నాయి, దీంతో రోడ్డు పై ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనాలు ఇరువైపులా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని రాకపోకలను పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.