నిరుపేద భూములను లాక్కోవడానికే మాస్టర్ ప్లాన్‌

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: నిర్మల్‌లో మున్సిపల్ మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని బీజేపీ నేతమాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. మహేశ్వర్‌రెడ్డి దీక్షకు బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. రైతుల పక్షాన పోరాటం చేస్తున్న మహేశ్వర్ రెడ్డికి పార్టీ పూర్తి అండగా ఉంటుందని అన్నారు. అభివృద్ధి పేరిట సీఎం కేసీఆర్ అన్ని రకాల దోపిడీకి తెరలేపారన్నారు. నిరుపేద భూములను లాక్కోవడానికే మాస్టర్ ప్లాన్‌ను రూపొందించారని మండిపడ్డారు. అగ్రిజోన్‌ను ఇండస్ట్రియల్ జోన్‌గా మార్చే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. నిర్మల్ కొత్త మాస్టర్ ముసాయిదా బీఆర్ఎస్ నాయకుల లబ్ధి కొరకే అని ఆరోపించారు. తక్షణమే రద్దు చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. కేసీఆర్ మాటగారిచెప్పేవన్నీ అబద్ధాలుఅభివృద్ధి శూన్యమంటూ వ్యాఖ్యలు చేశారు. నైజాం చక్రవర్తిల వ్యవహరిస్తున్నారన్నారు. ప్రతిపక్ష నేతలను అరెస్టు చేస్తూ ధర్నాలురాస్తారోకాలు చేయకుండా పోలీసులతో అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహేశ్వర్‌రెడ్డి దీక్షకు మద్దత్తుగా భారీగా బీజేపీ శ్రేణులు తరలివచ్చారు.

Leave A Reply

Your email address will not be published.