పివి చలపతిరావు గారు మరణించారన్న వార్త తీవ్రంగా బాధించింది.
- డాక్టర్ కె లక్ష్మణ్, పార్లమెంట్ సభ్యులు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: పివి చలపతిరావు గారు మరణించారన్న వార్త తీవ్రంగా బాధించిందని పార్లమెంట్ సభ్యులు డా.కె.లక్ష్మణ్ అన్నారు.
భారతీయ జనతా పార్టీ (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్) రాష్ట్ర అధ్యక్షులుగా, శాసనమండలి సభ్యులుగా పని చేయడం జరిగింది. కార్మిక సంఘంలో నాయకుడిగా ఉద్యమాలకు నాయకత్వం వహించిన వ్యక్తి. తుది శ్వాస వరకు భారతీయ జనతా పార్టీ అభ్యున్నతికి కృషి చేసిన వ్యక్తి.
వారితో కలిసి అనేక కార్యక్రమాల్లో, ఉద్యమాలలో పాల్గొనడం జరిగింది.
సుదీర్ఘకాలం వారితో కలిసి పని చేయడం జరిగింది. వారి మార్గదర్శకం నేటి తరానికి భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకం. వారు పని చేసే విధానం, క్రమశిక్షణ మాకు ప్రేరణ. తన జీవితాన్ని ప్రజలకు, పార్టీకి, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, బి ఎం ఎస్ కు అంకితం చేసిన వ్యక్తి.
విలువలతో కూడిన రాజకీయాలను నడిపిన వ్యక్తి. సాధారణమైన జీవితాన్ని తుది వరకు గడిపారు.
పివి చలపతిరావు గారి మరణం భారతీయ జనతా పార్టీకి తీరనిలోటు. చలపతిరావు గారి కుమారుడు&శాసనమండలి సభ్యులు శ్రీ పివిఎన్ మాధవ్ కు మనోధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని కలిగి ఉండాలని ధైర్యంగా ముందుకు సాగాల్సిన సమయం ఇది అన్నారు. పివి చలపతిరావు గారి మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం సానుభూతి తెలియజేస్తూ, కోరుతూ వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నానన్నారు.