సూపర్ స్టార్ కృష్ణ మరణించారన్న వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ప్రముఖ సినీ హీరో, నిర్మాత, దర్శకుడు కృష్ణ (ఘట్టమనేని శివరామ కృష్ణమూర్తి) గారు నేడు మరణించారన్న వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని పార్లమెంట్ సభ్యులు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. తెలుగు చలనచిత్ర రంగంలో తనకంటూ ప్రముఖమైన స్థానాన్ని కలిగిన వ్యక్తి కృష్ణ సాంఘిక, పౌరాణిక చలనచిత్రాలలో నటించి తెలుగు ప్రజలను మెప్పించిన వ్యక్తి, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు చలన చిత్రం తెలుగు ప్రజలు ఎల్లప్పటికీ గుర్తించుకునే చిత్రం. ఆ చిత్రం తీయడం సాహసొపేతమైనటువంటి నటన వారి సొంతం అన్నారు. జేమ్స్ బాండ్ లాంటి చిత్రాలతో తెలుగు ప్రజలకు కొత్తదనాన్ని పరిచయం చేసిన వ్యక్తి. తెలుగు చలనచిత్ర పరిశ్రమ, తెలుగు ప్రజలు గొప్ప సినీ నటుడిని కోల్పోయింది. వారి మరణం తెలుగు ప్రజలకు, సినిమా పరిశ్రమకు తీరని లోటు. సూపర్ స్టార్ కృష్ణ మరణం పట్ల వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తూ, వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు.