తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ప్రభుత్వంపై విమర్శలు తప్ప ప్రతిపక్షాలు చేసిందేమీ లేదని మంత్రి హరీష్రావు అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ… బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఒక్క మెడికల్ కాలేజీ అయినా తెచ్చారా అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఒక్క డయాలసిస్ అయినా మంజూరు చేయించారా అని నిలదీశారు. కేంద్ర వైద్యా ఆరోగ్య శాఖ మంత్రి సొంత రాష్ట్రం యూపీ చివరి స్థానంలో ఉందన్నారు. ఉద్యోగాలు భర్తీ చేస్తే బండి సంజయ్ కుళ్లుకుంటున్నారని అన్నారు. ఉద్యోగాలు ఊడగొట్టే పార్టీ బీజేపీ అని హరీష్రావు వ్యాఖ్యలు చేశారు.