నకిలీ హామీలు వ్యకిలి చేష్టలు చేయడమే ప్రతిపక్షాల పని

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: నకిలీ హామీలువెకిలి చేష్టలు చేయడమే ప్రతిపక్షాలు పని అంటూ మంత్రి హరీష్‌రావు విమర్శలు గుప్పించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ కన్నా మెరుగైన పాలన ఎక్కడ ఉందో చెప్పాలన్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో పొలిటికల్ టూరిస్టులు వస్తుంటారంటూ ఎద్దేవా చేశారు. మొన్న అమిత్ షానిన్న ఖర్గే వచ్చి పేపర్ పై రాసిచ్చిన హామీలు చదివి వెళ్లారన్నారు. వారికి రాష్ట్రం పైన ఎలాంటి అవగాహన లేదని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి విషయంలో మాటలు కాకుండా చర్చకు రావాలని సవాల్ విసిరారు. వైద్యారోగ్య రంగంలో దేశంలోనే 3 వ స్థానంలో ఉన్నామన్నారు. తలసరి ఆదాయంలో భారతదేశంలో నెంబర్ వన్‌గా ఉన్నది తెలంగాణ ప్రభుత్వమని అన్నారు. కేవలం తెలంగాణ రాష్ట్రనికే కాదు దేశానికే అన్నం పెట్టె స్థాయికి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని తెలిపారు. ముచ్చటగా మూడోసారి బీఆర్‌ఎస్ పార్టీ వస్తుందని… హ్యాట్రిక్ కొట్టబోతుందని ధీమా వ్యక్తం చేశారు. మూడవ సారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ రానున్నారని తెలిపారు. బీఆర్‌ఎస్ స్లోగన్‌లు చేసే పార్టీ కాదు… సొల్యూషన్ ఇచ్చే పార్టీ అని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.