రెండు రాష్ట్రాల ప్రజలు బీఆర్ఎస్కు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయం
- కమలం నేత విజయశాంతి
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఏపీలో జనసేన బీజేపీ ని నష్టపరిచే ప్రయత్నం బీఆర్ఎస్ రూపంలో కేసీఆర్ చేస్తున్నట్లు ఆ రాష్ట్రంలో బీఆర్ఎస్ చేరికల పరిణామాలు సంకేతాలు ఇస్తున్నాయని కమలం నేత విజయశాంతి అన్నారు. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ… తెలంగాణ ప్రజలను మోసగించినట్లే ఏపీ లోనూ ప్రజలను నమ్మించగలుగుతానని కేసీఆర్ పిచ్చి ప్రయోగాలు చేస్తున్నారని విమర్శించారు. ఏది ఏమైనా ఏపీలో రాజ్యాధికార అర్హత కలిగిన అత్యంత బలమైన ఒక సామాజిక వర్గాన్ని బీజేపీకి దూరం చేయటానికి బీఆర్ఎస్ పేరుతో కేసీఆర్ చేస్తున్న దుష్ప్రత్నం చేస్తున్నారన్నారు. ఈ ప్రయత్నాన్ని ఏపీతో పాటు తెలంగాణలో రాజకీయంగా వెనక్కు నెట్టి వేయబడ్డ అన్ని వర్గాల సముదాయాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయన్నారు. ధనిక తెలంగాణను అప్పుల పాలు చేసి, ఆత్మహత్యల రాష్ట్రంగా మార్చిన కేసీఆర్ తీరు ఏపీ ప్రజలకు తెలియంది కాదని అన్నారు. రెండు రాష్ట్రాల ప్రజలు బీఆర్ఎస్కు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమని విజయశాంతి స్పష్టం చేశారు.