ముమ్మరంగా వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న పోలీసులు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో నల్గొండ జిల్లా వ్యాప్తంగా పోలీసులు ముమ్మరంగా వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని తూప్రాన్ పేట్ గ్రామ శివారులో జాతీయ రహదారిపై ఏర్పాటుచేసిన చెక్ పోస్ట్ వద్ద ఆయా ప్రాంతాల నుండి విచ్చేస్తున్న వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ నిర్వహిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికకు ఓటర్లను ప్రోలోబ పెట్టేందుకు డబ్బు మద్యం తరలించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామని పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు.