గంజాయి పట్టుకున్న పోలీసులు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలంలోని దుర్కి గ్రామం వద్ద నసురుల్లాబాద్ ఎస్సై లావణ్య ఆధ్వర్యంలో గురువారం వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న పోలీసులకు ఓ వ్యక్తి వద్ద 100 గ్రాములు గంజాయిని స్వాధీనపరుచుకున్నారు. ఈ కేసును బాన్సువాడ గ్రామీణ సిఐ సత్యనారాయణ  నసురు ల్లాబాద్ పోలీస్ స్టేషన్ కు చేరుకొని విచారణ జరుపు తున్నారు. ఈ సందర్భంగా సిఐ సత్యనారాయణ మాట్లాడుతూ నిందితుడు గంజాయి ఎక్కడ కొనుగోలు చేశాడు అని అంశాలపై విచారణ చేపట్టినట్టు పేర్కొన్నారు. యువత మత్తు పదార్థాలకు బానిసలై తమ విలువైన జీవితాలను పాడు చేసుకోవద్దని ఆయన సూచించారు. సిఐ వెంట నసురుల్లాబాద్ ఎస్సై లావణ్య సిబ్బంది ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.