హైదరాబాద్ లో పేలుళ్ల కుట్రను భగ్నం చేసిన పోలీసులు
హైదరాబాద్ లో పేలుళ్ల కుట్రను పోలీసులు భగ్నం చేశారు. జాహిద్ అనే వ్యక్తి ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలపై దాడులతో పాటు పేలుళ్లకు కుట్ర చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఉగ్రవాద కార్యక్రమాల కోసం జాహిద్ ఆరుగురు యువకులను రిక్రూట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. పలు టెర్రర్ గ్రూపులతో అతనికి లింకులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో మక్కామసీదు పేలుళ్ల కేసులో పోలీసులు జాహిద్ ను అరెస్ట్ చేసి ప్రశ్నించారు.