ప్రశాంతంగా ముగిసిన అధ్యక్ష ఎన్నికలు
తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: హైదరాబాద్ లోని
గాంధీ భవన్ లో సోమవారం రిటర్నింగ్ అధికారి, ఎంపీ రాజ్ మోహన్ ఉన్నితన్ ఆధ్వర్యంలో అధ్యక్ష ఎన్నిక ప్రశాంతంగా జరిగింది. ఈ ఎన్నికకు పీసీసీ నాయకుల నుంచి పూర్తి మద్దతు లభించిందని అన్నారు.నాయకుల సహకారంతోనే స్వేచ్ఛగా ఎన్నికలు జరిగాయి, తెలంగాణ పీసీసీ నేతలు ఏర్పాట్లు మంచి గా చేశారు అన్నారు.ఉదయం 10కి మొదలైన పోలింగ్, సరిగ్గా నాలుగు గంటలకు ముగిసింది. రాష్ట్రంలో మొత్తం 238 పీసీసీ డెలిగేట్స్, ముగ్గురు ఏఐసీసీ సభ్యులు తమకు వినియోగించుకున్నారు. మొత్తం 241కి గాను 226 మంది ఓటు వేశారు. ఎలాంటి ఫిర్యాదు లేకుండా సజావుగా ఎన్నికలు జరిగాయని ఆయన వెల్లడించారు.ఖర్గే తరఫు ఏజంట్లు మల్లు రవి, షబ్బీర్ అలీ, శశి థరూర్ తరఫు ఏజంట్లు శ్రీకాంత్, సంతోష్ ల సంపూర్ణ సహకారంతో స్వేచ్ఛగా ఎన్నికలు జరిగాయి. రేపు ఎన్నికల సంఘానికి బ్యాలెట్ బాక్స్ అందజేస్తాం, అదేవిధంగా 19 న అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెళ్లడవుతాయని ఆయన వివరించారు.