ముగిసిన  రాష్ట్ర‌ప‌తి శీతాకాల ద‌క్షిణాది విడిది

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/హైదరాబాద్ ప్రతినిది:  రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము శీతాకాల ద‌క్షిణాది విడిది ముగిసింది. దీంతో రాష్ట్ర‌ప‌తి హైద‌రాబాద్ నుంచి ఢిల్లీకి ప్ర‌త్యేక విమానంలో బ‌య‌ల్దేరారు. హాకీంపేట్ ఎయిర్‌బేస్‌లో రాష్ట్ర‌ప‌తికి గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్, శాస‌న‌స‌భ స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ వీడ్కోలు ప‌లికారు. శీతాకాల విడిది నిమిత్తం హైద‌రాబాద్‌కు వ‌చ్చిన ద్రౌప‌ది ముర్ము.. భ‌ద్రాద్రి, యాదాద్రి, రామ‌ప్ప ఆల‌యాల‌ను సంద‌ర్శించారు. ఈ నాలుగు రోజుల పాటు ముర్ము.. బొల్లారంలోని రాష్ట్ర‌ప‌తి నిల‌యంలో బ‌స చేశారు.రాష్ట్రపతి ద్రౌపదీముర్ము శీతాకాల విడిది కోసం సోమవారం తెలంగాణ‌కు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. హాకీంపేట్ ఎయిర్‌బేస్‌లో రాష్ట్ర‌ప‌తి ముర్ముకు సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇత‌ర నాయ‌కులు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు.

Leave A Reply

Your email address will not be published.