ముగిసిన మునుగోడు ఉపఎన్నిక నామినేషన్ల పర్వం
తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్ : మునుగోడు ఉపఎన్నిక లో కీలక ఘట్టమైన నామినేషన్ల పర్వం శుక్రవారంతో ముగిసింది. 25 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగ మొత్తంగా చూస్తే వంద మంది నామినేషన్లు వేసినట్లు సమాచారం. శనివారం నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 17వ తేదీ వరకు అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. నవంబర్ 3న ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. 6న కౌంటింగ్, ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.కాగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి శుక్రవారం కాంగ్రెస్ నేతలతో కలిసి నామినేషన్ వేశారు. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్ది ప్రభాకర్ రెడ్డి పోటాపోటీగా ర్యాలీలు తీశారు. ఈ ఎన్నికలో ఎవరికి వారే సిట్టింగ్ సీట్ను కాపాడుకునేందుకు పోటీపడుతున్నారు. ప్రజాశాంతి పార్టీ నుంచి గద్దర్ పోటీ చేస్తున్నారు. టీజేఎస్ (తెలంగాణ జనసమితి) నుంచి వినయ్ కుమార్ నామినేషన్ వేశారు.