ఉద్యోగుల పట్ల గత ప్రభుత్వ వైఖరి పై విచారణ జరిపించాలి

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: తెలంగాణా మునిసిపల్ ఉద్యోగుల సమస్యల పై మునిసిపల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అద్యక్షులు ఎల్.తాజ్ మోహన్ రెడ్డి ఆద్వర్యం లో సంఘం ప్రతి నిధులు టిపీసిసి ఉపాధ్యక్షులు మల్లు రవిని ఆయన నివాసం లో కలిసి కలిసి కొత్త ప్రభుత్వానికి అభినందనలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా తెలంగాణా మునిసిపల్ ఉద్యోగులు తొమ్మిది సంవత్సరాలుగా ఎదురుకొంటున్న సమస్యలు, అణచి వేతళ్ళు, అక్రమకేసుల బనాయింపు, గత ప్రభుత్వం ఉద్యోగుల పట్ల అవలంబించిన వైఖరి మొదలగు అంశాలపై వినతి పత్రం సమర్పించారు. కొతమంది ఉద్యోడులు చెప్పిన మాటలు విని గత బిఆర్ఎస్ ప్రభుతం తెలంగాణా ఉద్యోగుల పట్ల అనిచివేట్ ధోరణి అవలంబించడమే ఉద్యోగులకు తీరని అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేసారు. తెలంగాణ ఉద్యమం సమయంలోనే తమ అసోసియేషన్ కు చెందిన వివిధ గ్రేడ్లలోని గెజిటెడ్ ఉద్యోగులం ఉద్యమం లో పాల్గొన్న విశయాన్ని వారు వివరించారు. తెలంగాణ ఏర్పాటు అయ్యాక కూడా పలు క్రిమినల్ కేసులు పెట్టారని, గత ప్రభుత్వ హయాంలో జరిగిన జరిగిన అవకతవక లపై జ్యూడిషియల్ ఎంక్వయిరీ జరిపించాలని విజ్ఞప్తి చేసారు.

Leave A Reply

Your email address will not be published.