బీసీ రిజర్వేషన్ల పోరాటంలో మహిళల పాత్ర కూడా కీలకమైనది`
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ;చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని అందుకు పార్లమెంట్ లో బిల్లు కై పోరాటాన్ని ఉద్రుతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. శనివారం బిసి భవన్ లో బీసీ మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ నిర్మల ముదిరాజ్ నేతృత్వంలో పెద్ద ఎత్తున మహిళలు బిసి సంఘం లో సభ్యత్వం తీసుకున్నారు.ఈ సందర్భంగా మహిళలను ఉద్దేశించి ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ బీసీల రాజకీయ రిజర్వేషన్ల పోరాటంలో మహిళల పాత్ర కూడా కీలకమైనదని అన్నారు పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని అలాగే మహిళలకు కూడా చట్టసభల్లో 50% రిజర్వేషన్ కల్పించాలని ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నీలా వెంకటేష్, బిల్లా దీపిక, పి శ్రీదేవి,కే హేమలత, జి కీర్తి, కె అన్నపూర్ణ, బి ప్రేమలత, కే జ్యోతి, పీ వరలక్ష్మి, ఎం రమాదేవి ,శాంత కుమారి, జి జగదాంబ, తదితరులు పాల్గొన్నారు