టి శాట్ పరిధిని మరింత విస్తృతం చేయాలి
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: విద్యతోపాటు నైపుణ్యం పెంచేలా టీ-శాట్ కార్యక్రమాలు ఉన్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. టీ-శాట్ పరిధిని మరింత విస్తృతం చేయాలని సూచించారు. పిల్లలకు పాఠాలు చెప్పే పద్ధతి మారాలని చెప్పారు. బోధనా పద్ధతుల కోసం మల్టీమీడియా ఉపయోగించాలని తెలిపారు. టీ-శాట్ ఆరో వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్లో జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ సమక్షంలో ఉస్మానియా యూనివర్సిటీ, ఆహాతో టీ-శాట్ ఒప్పందం కుదుర్చుకున్నది.