రాగల రెండు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల 12 వరకు తేలికపాటి జల్లులు కురుస్తాయని చెప్పింది. 13న ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పలు జిల్లాల్లో కురుస్తాయని పేర్కొంది.ఈ మేరకు ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది. తూర్పు దిశ నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తున్నాయని, రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా చలి ప్రభావం ఎక్కువగా ఉండనుందని వివరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదిలి తుఫాన్గా మారిందని పేర్కొంది. గాలులకు తుఫాను తోడవడంతో చలి తీవ్రత ఎక్కువవుతున్నది.