వృద్ధురాలిని చంపి బంగారం దోచుకెళ్లిన దుండగులు

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: వృద్ధురాలు చంపేసి ఆమె ధరించిన బంగారు ఆభరణాలను గుర్తుతెలియని దుండగులు అపహరించిన ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం లోని రుద్రూర్ మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన మందారి భూదేవ్వను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి ఆమె ఒంటిపై ఉన్న బంగారం ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఆమె మృతదేహాన్ని స్థానికంగా ఉన్న విఠలేశ్వర ఆలయం పక్కన గల మురికి కాలువలో పడేసి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Leave A Reply

Your email address will not be published.