ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం దర్యాప్తు పై ధర్మాసనం స్టే
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఎమ్మెల్యేల కొనుగోలువ్యవహారానికి సంబంధించి బీజేపీ వేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. పోలీసుల దర్యాప్తుపై ధర్మాసనం స్టే విధించింది. పోలీసుల దర్యాప్తును వెంటనే నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. అలాగే 8 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాని కి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. మునుగోడు ఉప ఎన్నిక ముగిసే వరకు విచారణ వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. తదుపరి విచారణను హైకోర్టు వచ్చే నెల 4కు వాయిదా వేసింది.