పని ఇద్దరిది-పని భారం పది మందిది

-   జోగులాంబ గద్వాల జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు  తట్టే మహేష్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాష్ట్ర ప్రభుత్వం బిసి లకు లక్ష రూపాయల లోన్ అనగానే జాతరను తలపిస్తుంది గద్వాల తహసీల్దార్ కార్యాలయం.20-50 వేల మంది జనాభ వున్న మండలానికి ఇద్దరు అధికారులు.లక్ష-రెండు లక్షలు జనాభ వున్నా మండలానికి ఇద్దరు అధికారులు.గద్వాల తహసీల్దార్ కార్యాలయంలో పని చేస్తున్నది ఇద్దరు రెవెన్యూ అధికారులే. కానీ పని భారం మాత్రం పది మంది రెవెన్యూ అధికారులది.జిల్లా కేంద్రంలో ప్రోటోకాల్ వాళ్ళే చూడాలి, అధికారుల మంచి-చెడులు వాళ్ళే చూడాలి,ప్రెస్, పోలీస్, పొలిటికల్ వాళ్ళు ఎవరైనా కార్యాలయంకు వస్తే పరిష్కారం వాళ్ళే చెప్పాలి,భూ సమస్యలు వాళ్ళే చూడాలి, సర్టిఫికెట్స్ వాళ్ళే చూడాలి… ఇలా ఒక్కటా రెండా? చెబుతూ పోతే వాళ్ళ సమస్యలు ఒక లక్ష.ఇందులో ఏ ఒక్కరిని ఆగండి చేస్తాం, చూస్తాం అనడానికి రాదు.అలా ఒకవేళ చెప్పారనుకోండి అప్పుడు పైనుండి రెకమెండేషన్ మళ్ళీ….. ఆముదానికి కొత్తిమీర బిర్యానీ అడిగింది అన్నట్టుగా వుంది ఈ ఇద్దరి ఉద్యోగం అని అనుకుంటున్నారు సామాన్య ప్రజనీకం సైతం.60-70 ఏళ్ళ వయసులో రావాల్సిన రోగాలు 35-45 ఏళ్ళ వయసులో వస్తున్నాయంటే ఇలాంటి పనిభారం వున్నప్పుడు రాక తప్పదు అంటున్నారు వైద్యులు.37 వార్డులున్న ఇంత పెద్ద గద్వాల పట్టణం,సుమారు 25 కి పైగా వున్న గ్రామపంచాయతీ లు వున్న గద్వాల మండలానికి ఒకే కార్యాలయం ఉండటమే పని భారానికి కారణం అంటున్నారు. మండలానికి సపరేట్ తహసీల్దార్ కార్యాలయం, పట్టణానికి సపరేట్ తహసీల్దార్ కార్యాలయం ఉంటేనే అధికారులు అందరూ అందుబాటులో ఉంటారు.పని త్వరగా పూర్తి చేయడానికి ఆస్కారం ఉంటుంది.జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఆ దిశగా అడుగులు వేసి కార్యాలయాలను మెరుగు పరిస్తే బాగుండు అని ప్రజలు అనుకుంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.