వివాహిత ప్రాణం బలిగొన్న పేస్ బుక్ ప్రేమ
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఈనెల 6వ తేదీనా బాన్సువాడలో అదృశ్యమైన ఉస్మాబేగం ఉత్తర్ప్రదేష్లో శవమై కనిపించింది. గజరాహులా లోని చెక్మెట్ సెక్యూరిటీ కంపెనీ ఆవరణలో హత్యకు గురైంది. విచారణ చేపట్టిన పోలీసులు ఆ కంపెనీలో పనిచేసే షహజాద్ను అదుపులోకి తీసుకుని విచారించగా ఇరువురి మద్య గల ఫేస్బుక్ ప్రేమ వెలుగులోకి వచ్చింది. షహజాద్ను కలిసేందుకు ఈనెల 6న బాన్సువాడలోని తన ఇంటి నుండి బయలుదేరిన ఉస్మా అతడి సూచన ప్రకారం గజరాహు చేరింది. తనను పెళ్ళి చేసుకోవాలని కోరగా కోపోద్రేకుడైన షహజాద్ ఆమెను తాడుతో కట్టేసి ఆ తర్వాత తాను పనిచేస్తున్న కంపెనీ ఆవరణలో ఇటుకతో ఆమె తలపై గట్టిగా కొట్టి చంపేసి పడేసి వెళ్ళిపోయాడు. ఘటనలో ఉస్మాబేగంకు ఆపాటికే వివాహం కాగా తన భార్య అదృశ్యం అయినట్లు బాన్సువాడ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేయగా ఉస్మా యూపీలో చనిపోయినట్లు పోలీసులకు సమాచారం అందింది. 12 యేండ్ల క్రీతం బాన్సువాడకు చెందిన ముఖీద్తో ఉస్మాబేగంకు వివాహం జరుగగా వారికి సంతానం కూడా ఉన్నారు.