దేశవ్యాప్తంగా కోర్టుల్లో 71 వేలకు పైగా పెండింగ్ కేసులు

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: దేశంలోని న్యాయస్థానాల్లో పెండింగ్‌ కేసులు పేరుకుపోతున్నాయి. వివిధ హైకోర్టుల్లో 71,000కుపైగా కేసులు 30 ఏండ్లకుపైగా పెండింగ్‌లో ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో వెల్లడించింది. మరోవైపు డిస్ట్రిక్ట్‌, సబార్డినేట్‌ కోర్టుల్లో 1.01 లక్షల కేసులు మూడు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్నట్టు తెలిపింది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ ఓ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. కోర్టుల్లో మొత్తం పెండింగ్‌ కేసుల సంఖ్య ఐదు కోట్ల మార్క్‌ను దాటినట్టు తెలిపారు.సుప్రీంకోర్టులో జూలై 1 నాటికి 69,766 కేసులు పెండింగ్‌లో ఉన్నట్టు మంత్రి వెల్లడించారు. హైకోర్టుల్లో 60,62,953 కేసులు, డిస్ట్రిక్ట్‌, సబార్డినేట్‌ కోర్టుల్లో 4,41,35,357 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. కేసులు పేరుకుపోవడానికి కేవలం న్యాయమూర్తుల కొరత ఒక్కటే కారణం కాదని పేర్కొన్నారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, కేసుల్లో సంక్లిష్టత, బార్‌, దర్యాప్తు సంస్థలు, సాక్షులు, కక్షిదారులు తదితర భాగస్వామ్యపక్షాల సహకారం వంటి అంశాలు కూడా కేసుల పెండింగ్‌కు కారణమని వివరించారు.

Leave A Reply

Your email address will not be published.