చంద్రబాబుని జైల్లోనే అంతమొందించే కుట్ర జరుగుతుంది

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ఎలాంటి ఆధారాలు లేకుండా టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేసిందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు మండిపడ్డారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. అరెస్టు తర్వాత ఇప్పుడు ఆధారాల కోసం అధికారులు వెతుక్కుంటున్నారన్నారు. చంద్రబాబుని జైల్లోనే అంత మొందించేందుకు కుట్ర జరుగుతోందని తమకు భయమేస్తోందని తెలిపారు. సీఎం జగన్‌ది నేర చరిత్ర కలిగిన కుటుంబమన్నారు. గతంలో ఎంపీ రఘురామని దారుణంగా కొట్టి వాళ్ళ సొంత డాక్టర్ల చేత ఎలాంటి దెబ్బలు తగలలేదు అని రిపోర్టు ఇప్పించారన్నారు. వ్యక్తులను, వ్యవస్థలను సీఎం జగన్ మేనేజ్ చేస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్ష నేతపై వైసీపీ నేతలు ఆంబోతుల్లా మాట్లాడుతున్నారని.. నేరస్తులను ఎన్నుకోవడం సమాజానికి మంచి కాదన్నారు. తల్లి అనారోగ్యం సాకుగా చూపించి ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ అరెస్టు నుంచి తప్పించుకు తిరుగుతున్నారన్నారు. చంద్రబాబును పరామర్శించడానికి కనీసం కుటుంబ సభ్యులకు కూడా సరైన సమయం ఇవ్వక పోవడం దారుణమని కనపర్తి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.