మునుగోడు ఉప ఎన్నికల బరిలో బరిలో 47 మంది

తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్: మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగిసింది. ఈ ఉప ఎన్నికకు మొత్తం 130 మంది అభ్యర్థులు 190 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో 47 మంది నామినేషన్లు తిరస్కరించబడ్డాయి. మిగిలిన 83 మందిలో 36 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. మొత్తంగా ఉప ఎన్నిక బరిలో 47 మంది ఉన్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అయితే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చొరవతో మునుగోడు ఉప ఎన్నిక బరిలో నిలిచిన 13 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. నిన్న పది మందిఇవాళ ముగ్గురు నామినేషన్లను ఉపసంహరించుకుని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతు ప్రకటించారు.మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ తరపున కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిబీజేపీ తరపున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి రెడ్డి బరిలో ఉన్నారు. ఈ ముగ్గురి మధ్య ప్రధాన పోటీ నెలకొంది.

Leave A Reply

Your email address will not be published.