తెలంగాణ బీజేపీలో ఎలాంటి మార్పులు ఉండదు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ బీజేపీలో ఎలాంటి మార్పులు ఉండవని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న టీమ్‌తోనే ఎన్నికలకు వెళ్తామన్నారు. ఎన్నికలు వస్తే బీజేపీకి ప్రజలే అభ్యర్థులను ఇస్తారని అన్నారు. తమకు నాయకత్వ సమస్య లేదని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.తెలంగాణలో నియంత పాలన సాగుతోందని విమర్శలు గుప్పించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌పై దర్యాప్తు జరుగుతుంటే కల్వకుంట్ల కుటుంబానికి చెందినవారి పేర్లు బయటపడ్డాయని… దీనితో కేంద్రానికి ఏం సంబంధం?, ప్రధానిపై విమర్శలు ఎందుకు? అని ప్రశ్నించారు. ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేయమని తాము ఆహ్వానించలేదని తెలిపారు. కవిత అరెస్ట్‌ను సీబీఐ చూసుకుంటుందని కేంద్రమంత్రి అన్నారు.

Leave A Reply

Your email address will not be published.