ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ డబ్బుతోనే పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను దెబ్బతీశారు

- తెలంగాణ కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్

తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్:  ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో వచ్చిన డబ్బుతోనే పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను దెబ్బతీశారని తెలంగాణ కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ లో సీఎం కేజ్రీవాల్ పాత్ర కూడా ఉంది. లిక్కర్ స్కామ్‌లో కవిత నేను పెద్ద సముద్రంలో చిన్న చేపను అన్నారు. అది నిజమే. చిన్న చేపే పెద్ద గేమ్ ఆడింది. లిక్కర్ కుంభకోణంలో బీఆర్‌ఎస్, ఆప్, వైసీపీ కలిసి అవినీతికి పాల్పడ్డాయి. ఎక్సైజ్ మంత్రి సిసోడియా నే కాదు ఇంకా పెద్దల పాత్ర ఉంది. ఈ కేసులో పాలసీని ఆమోదం తెలిపిన లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌ను ఎందుకు ఇందులో పాత్రదారును చేయలేదు. అలాగే ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఎందుకు బాధ్యులను చేయలేదు. అసలు దోషులను పక్కన పెట్టి కొంతమంది దోషులను మాత్రమే అరెస్టులు చేసి విచారణ చేస్తున్నారు. గోవా, పంజాబ్‌లో కాంగ్రెస్‌ను ఓడించేందుకు బీఆర్ఎస్ లిక్కర్ డబ్బును పంచిపెట్టింది. ఆప్ అక్కడ పోటీ చేయడం వల్ల కాంగ్రెస్ నష్టపోయింది. లిక్కర్ స్కామ్, లిక్కర్ ఫైల్స్ అన్ని బీజేపీ కనుసన్నుల్లోనే నడుస్తున్నాయి. బీజేపీ ఆప్, బీఆర్‌ఎస్ వైసీపీ కలిసి పని చేస్తున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్‌ ను దెబ్బ తీయడానికి ఇప్పుడు బీఆర్ఎస్, ఆప్ పని చేస్తున్నాయి. మద్యంతో దేశాన్ని నింపి కాంగ్రెస్‌ను దెబ్బ తీయడానికి కుట్ర చేస్తున్నారు. అదానీ ఇష్యూ పక్కన పెట్టడానికే లిక్కర్ స్కామ్‌ను హైలెట్ చేస్తున్నారు.’’ అని చెప్పుకొచ్చారు.

Leave A Reply

Your email address will not be published.