తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:
చర్లగూడెం భూ నిర్వాసితులు తమకు న్యాయం చేయాలనీ కోరుతూ దీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా దీక్షా శిబిరం వద్దకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు,ఎంపీ బండి సంజయ్ కుమార్ చేరుకొని చర్లగూడెం భూ నిర్వాసితుల ఆందోళనకు మద్దతు ప్రకటించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ మెడలు వంచి భూ నిర్వాసితులకు న్యాయం జరిగేవరకు బీజేపీ పోరాడుతుందని హామీ ఇచ్చారు. 15 తర్వాత మునుగోడుకు వస్తానని. మీ తరపున కొట్లాడతానని భూ నిర్వాసితులకు హామీ ఇచ్చారు. మునుగోడు ఎన్నికల్లో మా తరపున కొట్లాడే బీజేపీకే ఓటేస్తామని చర్లగూడెం భూ నిర్వాసితులు మద్దతు పలికారు..