సీఎం జగన్ కావాలనే కక్షతో వాటిని రద్దు చేశారు

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: చంద్రబాబు ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందాల్లో తప్పులేదనిఅంతా సక్రమంగానే జరిగాయని హైకోర్టు చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి కావాలనే కక్షతో ఆ ఒప్పందాలను రద్దు చేశారని టీడీపీ శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ విమర్శించారు. ఈ సందర్భంగా గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఒప్పందాలు కాదన్నందుకు బయట మార్కెట్లో అధిక ధరకు విద్యుత్ కొనడం ఒక తప్పయితేవిద్యుత్ కొనకపోయినాఒప్పందం ప్రకారం విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు డబ్బులు కట్టడం మరో పెద్దతప్పు అన్నారు. ఈ తప్పుల ఫలితాలకు బాధ్యత వహించాల్సింది జగన్మోహన్ రెడ్డి కాదాఅని ప్రశ్నించారు. బ్యాక్ డోర్‌లో అధికధరకు విద్యుత్ కొన్నది… మీ దోపిడీకోసం కాదాఅని నిలదీశారు. ఒప్పందాల ప్రకారం విద్యుత్ కొనుగోళ్లు చేయకుండావాటిని ఉల్లంఘించిరద్దు చేసిఎందుకు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారన్నారు.నిన్నఈ రోజు రాష్ట్రంలో మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత ఉందనిమూడేళ్ల క్రితం మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఉన్న ఏపీని మూడేళ్లలోనే విద్యుత్ లోటు రాష్ట్రంగా మార్చారని పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. వైసీపీ దోపిడీకి అనుకూలంగా సంతకాలు పెట్టిన అధికారులకు ప్రమోషన్లు ఇచ్చి ఢిల్లీకి పంపుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజల నెత్తిన వేలకోట్ల విద్యుత్ ఛార్జీల అదనపు భారం మోపిన ప్రభుత్వంపైఅధికారులపై ముమ్మాటికీ క్రిమినల్ కేసులు పెట్టి విచారణ జరపాల్సిందేనన్నారు. ఆర్థికంగా డిస్కంలు దివాలాతీసే పరిస్థితిలో ఉంటే గృహలకు స్మార్ట్ మీటర్ల పేరుతో విద్యుత్ సంస్థలపై అదనపు భారం మోపడం సరైందేనాఅని ప్రశ్నించారు. అనాలోచితకక్షసాధింపు నిర్ణయాలుమీ లబ్ధికోసం తీసుకున్నస్వార్థ నిర్ణయాలే రాష్ట్ర విద్యుత్ రంగానికి శాపాలుగా మారాయన్నారు. విద్యుత్ రంగంలో అనేక అక్రమాలు జరిగాయని కోర్టులకు వెళ్లి భంగపడినవారుఈ ఏళ్లలో జరిపిన విద్యుత్ కొనుగోళ్లపై విచారణకు సిద్ధమాఅంటూ పయ్యావుల కేశవ్ సవాల్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.