దొంగల ముఠాను టీటీడీ పాలకమండలి సభ్యులుగా నియమించారు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  టీటీడీ నూతన పాలకమండలి నియామకంపై వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దొంగల ముఠాను టీటీడీ పాలకమండలి సభ్యులుగా నియమించారని జనసేన నేత కిరణ్ రాయల్ అన్నారు. తీహార్ జైలులో నంబరు వన్ ఖైదీలను పాలకమండలిలో నియంచినా ఆశ్చర్యం లేదని ఎద్దేవా చేశారు. తిరుమలలో అధికార పార్టీ పాపాలు పెరిగాయన్నారు. తిరుమల పవిత్రతను ప్రభుత్వం మంటగలిపిందని కిరణ్ రాయల్ విమర్శించారు. ఈఓ ధర్మారెడ్డి తీరు వల్లే తిరుమలలో పాపాలు పెరిగాయన్నారు. శరత్ చంద్రారెడ్డిని పాలకమండలి సభ్యునిగా తొలగించాలని డిమాండ్ చేశారు. తిరుమలలో పాపపై దాడి చేసిన చిరుత ను పట్టారు గానీ.. బాబాయిని హత్య చేసిన వారిని ఇప్పటికీ బోనులో పెట్టలేదని కిరణ్ రాయల్ విమర్శించారు.

Leave A Reply

Your email address will not be published.