ఈసారి తెలంగాణ లో హంగ్ అసెంబ్లీ వస్తుంది

-   కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు  చేశారు. మంగళవారం ఆయన ఇక్కడ ఢిల్లీ లో మీడియాతో మాట్లాడుతూ ఈసారి తెలంగాణ లో హంగ్ అసెంబ్లీ వస్తుందని జోస్యం చెప్పారు. తమతో కలవాల్సిందే కాబట్టి సీఎం కేసీఆర్‌ కాంగ్రెస్‌ను పొగుడుతూ.. బీజేపీ ని తిడుతున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్ ఒంటరిగా అధికారంలోకి రాదని, మరో పార్టీతో కలవాల్సిందేనని అన్నారు.అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఏం చేసిందో మేము చెప్పామని, దేశానికి చాలా చేసిందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ మంచి పార్టీ అని, తెలంగాణ ఇచ్చిందని.. మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎందుకు కొన్నారని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ సెక్యులర్ పార్టీలని, తాము బీజేపీతో కలిసేదిలేదని స్పష్టం చేశారు. సీనియర్ నేతలు అందరూ కలిస్తే కాంగ్రెస్‌కు 40 నుంచి 50 సీట్లు వస్తాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.మార్చి మొదటి వారంలో యాత్ర ప్రారంభిస్తానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. తాను స్టార్ క్యాంపైనర్‌నని రాష్ట్రమంతా తిరుగుతానని చెప్పారు. యాదగిరి గుట్ట నుంచి యాత్ర మొదలు పెడతానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కొత్త ఇంఛార్జ్ మానిక్ థాక్రే వచ్చిన తర్వాత పార్టీ పరిస్థితి బాగుందని, పార్టీ గాడిలో పడిందన్నారు. గత ఇంఛార్జ్ అంతా ఫోన్‌లోనే చూసుకునేవారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు.

Leave A Reply

Your email address will not be published.