పార్టీని మోసం చేసిన వారికి మునుగోడు ప్రజలు బుద్ధి చెప్పాలి

టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: పార్టీని మోసం చేసి వెళ్లిన వారికి మునుగోడు ప్రజలు గుణపాఠం చెప్పాలని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేషం మార్చి తిరుగుతున్న ఈ దొంగలకు బుద్ది చెప్పాల్సిన బాధ్యత మునుగోడు ప్రజలదేనన్నారు. శేషారెడ్డి వాగు మీద ప్రాజెక్టు కడతానన్న టిఆర్ఎస్ పార్టీ ప్రజలను నిలువునా మోసం చేసిందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు కాలేదని, ఎవరేం చెప్పినా ఓటు మాత్రం కాంగ్రెస్ కు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ఆడబిడ్డను గెలిపించి మునుగోడు గౌరవాన్ని నిలబెట్టి టీఆరెస్,బీజేపీ కుట్రలను తిప్పికొటట్టాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.