ధర్మాన్ని కాపాడే వారే రాజ్యమేలాలి
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ధ్యానం ద్వారా ఏదైనా సాధించవచ్చునని అలాంటి ఘనత గల, ధైర్యం గల, జ్ఞానం గల, వ్యక్తులు ధర్మాన్ని కాపాడే వారిని మరియు ధర్మం విలువ తెలిసిన వారిని, ధర్మం కోసం చివరి వరకు పోరాడే వారిని, ధర్మాన్ని గెలిపించే వారిని అభినందించి ఆశీర్వదించి ప్రజలకు సేవ చేసుకునే అవకాశాన్ని కల్పించాలని విజ్ఞప్తి చేస్తూ ధర్మాన్ని కాపాడే వారే రాజ్యమేలాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి పట్టణం టిటిడి కళ్యాణ మండపంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అహింసా ధర్మ మహా చక్రం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ అనునిత్యం ధ్యానం చేయడం తద్వారా ఈ యొక్క మానవాళికి మంచి జరగడం అనేది సాధ్యమని. ఈ యొక్క కార్యక్రమంలో పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ మూవ్మెంట్ ధ్యానులు మరియు వివిధ మండలాల నుండి తరలివచ్చిన సంగారెడ్డి జిల్లా పిరమిడ్ మాస్టర్స్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు.