చెట్టును ఢీకొట్టిన కారు ముగ్గురు మృతి
తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: పల్నాడు జిల్లా వినుకొండలోని కొత్తపాలెం వద్ద గురువారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇన్నోవా కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడిక్కడే ముగ్గురు మృతి చెందారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వినుకొండ పట్టణ సిఐ సాంబశివరావు, ఎస్ఐ ప్రసాద్ మాట్లాడుతూ.. గుంటూరుకు చెందిన సోమేసి బాలగంగాధర్ శర్మ (78) కుటుంబ సభ్యులు కర్ణాటకలోని బళ్లారిలో శుభకార్యానికి వెళ్లి ఇన్నోవా కారులో తిరిగి గుంటూరు వస్తుండగా కారు డ్రైవర్ నిద్రమత్తులో హైవే పక్కన ఉన్న చెట్టును ఢ కొట్టినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో బాలగంగాధర్ శర్మతో పాటు ఆయన భార్య యశోద (69), కార్ డ్రైవర్ అక్కడికక్కడే మతి చెందారు. నాగశర్మ, నాగసంధ్య, అనుపమ, కార్తికులు తీవ్రంగా గాయపడ్డారు. 108 సహాయంతో క్షతగాత్రులను వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా నలుగురు పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రాథమిక చికిత్స అనంతరం గుంటూరుకు తరలించారు.