తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ లో కొందరు పుట్టినరోజు వేడుకల సందర్భంగా గాల్లోకి కరెన్సీ నోట్లు విసురుతూ.. బాణా సంచా కాలుస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. వీడియో ఆధారంగా ముగ్గురు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు.రాజ్నగర్ ఎక్స్టెన్షన్ ప్రాంతంలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లోపల ముగ్గురు వ్యక్తులు కారుపైకప్పుపై నిలబడి బాణసంచా కాలుస్తూ.. డబ్బులు వెదజల్లారు. అపార్ట్మెంట్ యజమానుల సంఘం వీడియో తీసి ఎక్స్లో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్గా మారింది. ఈ వీడియోపై పోలీసులు స్పందించారు. వీడియో ఆధారంగా సదరు యువకులపై చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.నంద్గ్రామ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రవి కుమార్ సింగ్ మాట్లాడుతూ.. యువకులు అభ్యంతరకరమైన పదాలు ఉపయోగించారని, ఆ ప్రాంతంలో అల్లకల్లోలం సృష్టించారన్నారు. ఈ మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.